న్యూఢిల్లీ: తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ సత్తాచాటింది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజ..తాజా ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్లో శ్రీజ భారత నంబర్వన్ ప్యాడ్లర్గా నిలిచింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్లో శ్రీజ ఒక ర్యాంక్ మెరుగుపర్చుకుని 38వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో శ్రీజ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకుంది.
ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టి, బీరూట్ టైటిల్స్తో పాటు డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో మెరుగ్గా రాణించడం ద్వారా శ్రీజ తన ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపర్చుకుంది. మరోవైపు స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా 39వ ర్యాంక్లో నిలువగా, యశస్విని గొర్పాడే, అర్చనా కామత్ వరుసగా 99,100 ర్యాంక్లు దక్కించుకున్నారు. పురుషుల ర్యాంకింగ్స్లో శరత్కమల్ 37వ ర్యాంక్లో ఉండగా, సాతియాన్(60), మానవ్ థక్కర్(61) ఆకట్టుకున్నారు.