కామారెడ్డి, ఏప్రిల్ 23: ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని, 12వ తేదీన బడులు పునఃప్రారంభమవుతాయని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు. సెలవుల కాలంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని, ఎవరైనా క్లాసులు నడిపిస్తే సంబంధిత యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకునే ముందు తల్లిదండ్రులు సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు.