కోటగిరి: పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ భారం కావొద్దనే సదుద్దేంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని మిర్జాపురం సర్పంచ్ విజయ చిన్న సాయన్న అన్నారు. బుధవారం మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చ్మైరన్ పోచారం భాస్కర్రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డికి గ్రామ ప్రజల తరుఫున సర్పంచ్ విజయ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి లలిత, పార్టీ అధ్యక్షుడు సయ్యద్, రంగాగౌడ్, శ్రీధర్, గౌస్ తదితరులు ఉన్నారు.