కామారెడ్డి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నూతన ఎస్పీ ఆఫీస్ పక్కన రూ.40లక్షలతో సఖీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు.
పలు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు కౌన్సిల్ నిర్వహించడం, ఆశ్రయం కల్పించడం కోసం సఖీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నిట్టూ జాహ్నవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.