వర్ని : తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో రైతు సంక్షేమం సాధ్యమవుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్పోస్టును శనివారం సేవాలాల్ తండా వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తద్వారా రాష్ట్రంలోని రైతులందరు సుఖసంతోషాలతో ఎలాంటి అప్పులు లేకుండా జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా తిరిగి రైతన్న అప్పులపాలయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో వర్ని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీరాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బందెల సంజీవులు, రైతు బంధు మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, క్రిష్ణారెడ్డి, సర్పంచులు నానిబాబు, రాజు టీఆర్ఎస్ నాయకులు మేక వీరాజు, కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం
వర్ని మండలం శంకోర, వర్ని గ్రామాలకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను భాస్కర్రెడ్డి అందజేశారు.