కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శన కార్యక్రమంలో కళాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులను కాపాడుకుంటేనే కళలకు బ్రతికించుకున్న వళ్లమవుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకరులను ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.