కామారెడ్డి : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లకు తెగిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వర్షానికి రోడ్డు తెగిపోయింది. దీంతో
రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిచిలిపోయాయి. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న, మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.