న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్ లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి ఛాతిపై పెల్లెట్స్ గాయాలు ఉన్నాయి. దీంతో నిరసనకారులపై పెల్లెట్ గన్స్(Pellet Guns) వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా, ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. నిరసనకారులపై పెల్లెట్స్ వాడలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఆ రోజు విధుల్లో ఉన్న ఆర్ఏఎఫ్ ఆ పెల్లెట్స్ వాడినట్లు అనుమానిస్తున్నారు.
పెల్లెట్ గన్స్తో పాటు షాక్ బాటన్ను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడుతోంది. అయితే నిరసన ప్రదర్శన వేళ ఢిల్లీ పోలీసులతో పాటు ఆర్ఏఎఫ్ కూడా జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నది. అల్లరి మూకలను అరికట్టేందుకు ఆర్ఏఎఫ్ దళాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది సీఆర్పీఎఫ్కు చెందిన యూనిట్. అయితే ఆ పెల్లెట్స్ గాయాలు ఎలా అయ్యాయి, నిరసనకారులపై ఎవరు పెల్లెట్స్ వాడారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఆర్పీఎఫ్ పేర్కొన్నది.
🚨 FACT CHECK 🚨Claims stating that Delhi Police forces used pellet guns against peaceful protesters yesterday are completely false and misleading.Delhi Police neither possess pellet guns nor do they use them in the ongoing protest.The public is requested not to share or…
— Delhi Police (@DelhiPolice) July 22, 2026