బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్సువాడ క్రీడాకారులకు రూ.75వేల ఆర్థిక సహాయాన్ని ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి శుక్రవారం అందజేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కామారెడ్డి జిల్లా బాల,బాలికల జట్టులో బాన్సువాడ క్రీడాకారులు ఉండడంతో వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పోచారం భాస్కర్రెడ్డి వారు గోవా వెళ్లడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు పోచారం భాస్కర్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు లింగమేశ్వర్, మోతిలాల్ తదితరులు వున్నారు.