బాన్సువాడ ; ఎమ్మెల్యే, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, వర్ని, మోస్రా, రుద్రూర్ తదితర మండలాల్లో మంగళవారం ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై తప్పుడు కూతలు కూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవుపలికారు. ఆందోళన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, పోచారం అభిమానులు పాల్గొన్నారు.