ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో.. గులాబీ కండువా కప్పుకున్న పిప్రి ఎంపీటీసీ
పార్టీలో చేరిన బీజేపీ కార్యకర్తలు
ఆర్మూర్/ నందిపేట్/ నందిపేట్ (మాక్లూర్), ఫిబ్రవరి 6 : టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజూ వందలాదిమంది వివిధ పార్టీల కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. వీరిలో ప్రజాప్రతినిధులూ ఉన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో తాజాగా పిప్రి ఎంపీటీసీ సభ్యురాలితోపాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, యువజన సంఘాల సభ్యులు టీఆర్ఎస్లో చేరారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో భారీగా చేరారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆర్మూర్కు చెందిన వందలాది మంది ముస్లిం యువకులు టీఆర్ఎస్లో చేరారు. మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 32 మంది, పిప్రి ఎంపీటీసీ దేగాం ఎర్రవ్వ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 300 మంది యువకులు హైదరాబాద్లోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసం వద్ద పార్టీలో చేరారు. జీవన్రెడ్డి వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుచూపు లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఆందోళన చెందుతున్న ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్టీలో చేరిన వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని.. జిల్లాను టీఆర్ఎస్ కంచుకోటగా మారుస్తానని అన్నారు.
టీఆర్ఎస్లో చేరిన ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు..ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కంపల్లి సాగర్ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరగా…గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, లక్కంపల్లి ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు భోజన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.