రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన ప్రశాంత్, సోదరుడు మైనర్తో పాటు హత్యల కోసం ఒప్పందం చేసుకున్న మరో ఇద్దరు యువకులను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పరోక్షంగా సహకరించిన ప్రశాంత్ తల్లి వడ్డెమ్మను సైతం అరెస్టు చేశారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సింధూశర్మ మంగళవారం వివరాలను వెల్లడించారు. ఆస్తి కోసమే వరుస హత్యలు చేశాడని.. ప్రసాద్ కుటుంబాన్ని అంతమొందించి ఆస్తి మొత్తం కాజేయాలనే కుట్రతోనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని వివరించారు.
నిజామాబాద్, డిసెంబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి : సంచలనం సృష్టించిన ఆరు హత్య కేసుల నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చి క్కారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలో లభ్యమైన ఓ యువతి హత్య కేసును ఛేదిస్తున్న క్రమంలో దుర్మార్గులు చిక్కా రు. మొత్తం నలుగురు నిందితులు కాగా వీరిలో ప్రశాంత్ ఒక్కడికే 25 ఏండ్లు. ప్రశాంత్ తమ్ముడు మైనర్ కాగా వీరికి సహాయ పడిన మరో ఇద్దరు బానోతు విష్ణు, బానోతు వంశీ వయస్సు కేవలం 19 ఏండ్లు మాత్రమే. రూ.మూ డున్నర లక్షల అప్పును ఎగ్గొట్టేందుకు, రూ.20-25లక్షల విలువ చేసే ప్రసాద్ ఆస్తిని కొల్లగొట్టేందుకు పథకం ప్రకారం హత్యలు చేశారు. వీరికి ప్రశాంత్ తల్లి వడ్డెమ్మ సైతం పరోక్షంగా సహకరించింది. వీరందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా స మావేశంలో మంగళవారం వెల్లడించారు.
ప్రసాద్ 2018లో మాక్లూర్కు చెందిన ఒక అమ్మాయిని మోసం చేయగా ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ప్రసాద్పై సెక్షన్ 354డీ, ఐపీసీ 306 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అప్పటికే దుబాయ్లో ఉండగా ఈ కేసు పెండింగ్లో ఉంది. 2022 అక్టోబర్లో స్వగ్రామానికి ప్రసాద్ రావడంతోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించగా బెయిల్పై బయటికి వచ్చాడు. దుబాయ్లో ఉన్నప్పుడే మేడిద ప్రశాంత్కు.. పూనే ప్రసాద్ రూ.3.5లక్షలు అప్పు ఇచ్చాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ప్రసాద్ కుటుంబానికి మాక్లూర్లో నివసించే పరిస్థితులు లేకపోవడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచకు మకాం మార్చారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో తానిచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలంటూ ప్రశాంత్పై ప్రసాద్(36) ఒత్తిడి చేశాడు. మాక్లూర్లో రూ.25లక్షలు విలువ చేసే రెండు ఇండ్లు, ఒక జాగాను కుదువ పెట్టే ప్రయత్నం చేయగా సఫలీకృతం కాలేదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ను సంప్రదించగా తన పేరిట ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసిస్తే లోన్ ఇప్పిస్తానని చెప్పడంతో ప్రసాద్ నమ్మి రిజిస్ట్రేషన్ చేయించాడు. తీసుకున్న అప్పు, ఇండ్ల పేరిట ఇస్తానన్న లోన్ సంగతి ఏమిటని ప్రశ్నించగా ప్రశాంత్ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టా డు. ప్రసాద్, ఆయన కుటుంబీకులను చంపేస్తే ఆస్తులు తనకే చెందుతాయని ప్రశాం త్ భావించాడు. ఇందులో భాగంగానే హత్య కు మాక్లూర్ శివారులోని దాస్నగర్ తండాకు చెందిన బానోతు విష్ణు, బానోతు వంశీతో రూ.60వేలకు ఒప్పందం చేసుకొని ఆరుగురిని హత్య చేశాడు. వీరితో పాటు ప్రశాంత్ తమ్ముడు మైనర్ సైతం చేతులు కలిపినట్లుగా ఎస్పీ సింధూ శర్మ చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ రామన్, ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు అశోక్, జానకీరామ్, రవికుమార్, అబ్దుల్ హమీద్, శశికాంత్, నరేశ్, సుధాకర్ రెడ్డి, హోంగార్డు అరుణ్లను ఎస్పీ అభినందించారు.
మాక్లూర్ గ్రామానికి నవంబర్ 29న వచ్చిన ప్రసాద్ నేరుగా ప్రశాంత్ ఇంటికెళ్లి ఎలాగైన తన డబ్బులిచ్చేయాలని ఒత్తిడి చేశాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు బానోతు విష్ణు, బానోతు వంశీలతో సంప్రదింపులు జరిపాడు. నిజామాబాద్లో ఓ వ్యక్తి వద్ద కారును కిరాయికి తీసుకుని వచ్చి మద్యం సేవిద్దామంటూ ప్రసాద్తో కలిసి మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. మద్యం మత్తులో ముంచిన తర్వాత కట్టెలు, రాళ్లతో ప్రసాద్ తలపై మోది చంపేసి అక్కడే చెట్ల పొదల్లో పడేశారు. అర్ధరాత్రి మాక్లూర్కు వచ్చి పార, గడ్డపారలను తీసుకు వచ్చి అడవిలోనే ప్రసాద్ను పూడ్చివేశారు. ప్రసాద్ కనిపించడం లేదని కుటుంబీకులు ఎవరైనా పోలీసులను సంప్రదిస్తారని భావించి డిసెంబర్ 1న పాల్వంచ గ్రామానికి ప్రశాంత్ ఒక్కడే వెళ్లాడు. గతంలో యువతి ఆత్మహత్య కేసు విషయంపై ప్రసాద్ కోసం పోలీసులు తిరుగుతున్నారని ఆయన భార్య శాన్విక(29), చెల్లెలు శ్రావణి(23)లను భయపెట్టి నిజామాబాద్కు తీసుకు వచ్చారు. భర్త దగ్గరికి పోదామని చెప్పి శాన్వికను బాసర బ్రిడ్జి వైపు తీసుకెళ్లి ముగ్గురు కలిసి గొంతు నులిమి చంపేసి గోదావరి నదిలో పడేశారు. అన్నా వదినల దగ్గరికి వెళ్దామని మాయమాటలు చెప్పి శ్రావణిని కారులో ఎక్కించుకుని మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో జాతీయ రహదారి 44 పక్కన గొంతు బిగించి చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.
హత్య కేసు నిందితుల్లో ఒకడు మైనర్ ప్రశాంత్తో చేతులు కలిపిన ఇద్దరికి 19 ఏండ్లే పక్కా ప్లాన్ ప్రకారమే…ప్రసాద్ తల్లి సుశీల, అతని పిల్లలు చైత్రిక(8), చైత్రిక్(8), ఇంకో చెల్లెలు స్వప్న(26)ను భయభ్రాంతులకు గురి చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉంచారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్ తన తల్లి వడ్డెమ్మను వీరితో పాటే ఉంచాడు. ప్రసాద్ తన పిల్లలను చూ డాలని అంటున్నారని చెప్పి లాడ్జిలో ఉన్న చైత్రిక, చైత్రిక్ను డిసెంబర్ 4న తన తమ్ముడిని వెంటేసుకుని కారులో సోన్ బ్రిడ్జి వైపు వెళ్లారు. పిల్లలను గొంతు నులిమి చంపి వంతెన కింద కాలువలో పడేశారు. భార్య పిల్లలతో ప్రసాద్ ఒకే చోట క్షేమంగా ఉన్నారని నమ్మబలికారు. డిసెంబర్ 13న లాడ్జిలో ఉన్న ప్రసాద్ మరో చెల్లెలు స్వప్న(దివ్యాంగురాలు)ను కారులో ఎక్కించుకుని గాంధారి ఎక్స్ రోడ్డు సమీపంలోని భూంపల్లి శివారులో గొంతుకు తాడు బిగించి చంపేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారు. ప్రసాద్ తల్లి సుశీలను సైతం హత్య చేయాలని భావించిన సమయంలో ఆమె తప్పించుకున్నది. డిసెంబర్ 14న వెలుగు చూసిన ఓ యువతి హత్య కేసును ఛేదిస్తున్న క్రమంలో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నిందితులు మేడిద ప్రశాంత్, బానోతు విష్ణు, బానోతు వంశీ, మరో మైనర్ బాలుడిని పాల్వంచ వద్ద పోలీసులు పట్టుకుని వివరాలు ఆరా తీయగా ఆరు హత్యల విష యం బయటపడింది. నిందితుల నుంచి కారు, ఒక బైక్, భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రూ.30వేల నగదు, 5 సెల్ఫోన్లు, తాడు, 2 పెట్రోల్ బాటిళ్లు, పుస్తెలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.