వేల్పూర్, అక్టోబర్ 22 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఆదివారం ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 40 మంది బీఆర్ఎస్ నాయకుడు రాజాగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, మంత్రి వేముల కృషితో బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా అందుతున్న సంక్షే మ పథకాలు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి చేసి చూపించిన మంత్రి వేములకు తోడుగా నిలబడేందుకు బీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సమక్షంలో ..
నగరంలోని బీజేపీ సీనియర్ నాయకుడు, విద్యుత్శాఖ కార్మిక విభాగం నాయకుడు పంచరెడ్డి లక్ష్మణ్తోపాటు కార్యకర్తలు ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బిగాల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు దారం సాయిలు, మల్లేశ్ యాదవ్, ఆకుల శ్రీశైలం, ముత్యాలు, ప్యాట సంతోష్, బాల్కిషన్, ఆకుల శ్రీను, ప్రవీణ్గౌడ్, సురేశ్, రంగు సీతారాం తదితరులు పాల్గొన్నారు.