ఏర్గట్ల, నవంబర్ 26 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన చూసి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసలు కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గడ్డం మోహన్రెడ్డి శనివారం మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, తాళ్లరాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి రమేశ్, పార్టీ నాయకుడు ఏనుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో..
నందిపేట్, నవంబర్ 26 :మండలంలోని వెల్మల్, కౌల్పూర్, సిర్పూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కేసీఆర్ అద్భుతమైన పాలన, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని పేర్కొన్నారు. ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ర్టానికి, దేశానికి శరణ్యమన్నారు. టీఆర్ఎస్ది నూరుశాతం అభివృద్ధి అజెండా అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లది అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని చూసి ఓర్వలేని దుర్భుద్ధి అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని, ఈ రెండు ఏడుపుగొట్టు పార్టీలేనని, తెలంగాణకు శనిలా దాపురించాయని విమర్శించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న, కేజీ సురేశ్, శంకర్, రఫీ, కోట జాన్, మల్లేశ్, కొల్లి శ్రీను, దండు రాజన్న, గాదరి రాజన్న, నల్లన్న, నాగరావు పాల్గొన్నారు.