దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు.
అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సురేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఆర్మూర్, అర్బన్, జుక్కల్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, హన్మంత్ షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.