వినాయక్నగర్, మార్చి 2 : రౌడీషీటర్లు తమ నడవడిక మార్చుకోకుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్కు కమిషనరేట్ పరిధిలోని 326 మంది రౌడీషీటర్లను పిలిపించి మాట్లాడారు.
రౌడీషీటర్ల కదలికపై ప్రతిరోజూ నిఘా ఉంటుందని, రాత్రి వేళల్లో అడ్డాలు ఏర్పాటు చేయడం, తగాదాల్లో తలదూర్చడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రొబెషనరీ ఐపీఎస్ చైతన్యరెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ఎల్.రాజా వెంకటరెడ్డి, బస్వారెడ్డి, పి.శ్రీనివాస్, ఎస్బీఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.