యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మోస్రా తదితర ప్రాంతాలకు రాష్ట్రంలోనే వరిసాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడి రైతులు ప్రతి ఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగుచేసి దిగుబడులు సాధించడంలో మంచిపేరుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కన్నా ముందుగా వరినాట్లు వేసి ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ దిగుబడులు సాధిస్తున్నారు. చందూర్ మండల కేంద్రంలో మంగళవారం చంద్రకాంత్ అనే యువరైతు కోత కోసి వచ్చిన ధాన్యాన్ని విక్రయించాడు. పచ్చివడ్లను క్వింటాలుకు రూ.2,200కు విక్రయించినట్లు తెలిపారు.