
Sirikonda | సిరికొండ, ఏప్రిల్ 5 : ఆరుగారం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే ప్రకృతి ప్రళయానికి నాశనమైంది. దీంతో రైతులు కన్నీట పర్వతమవుతున్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి , చిమన్ పల్లి గ్రామంలోని జినిగ్యలలో వడగండ్ల వాన పడి రైతన్నను కోల్కోని దెబ్బ తీసింది. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట కండ్ల ముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
యాసంగి సీజన్లో వేలాది ఎకరాలు వరి సాగు చేసి కోతలు ప్రారంభం కాగా ధాన్యం అరపెడుతున్నారు. కళ్లాల్లో ఎండబెట్టిన ధాన్యం సైతం తడిసి ముద్దైంది. ఈదురు గాలులతో పలుచోట్ల వరి నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.