కమ్మర్పల్లి/వేల్పూర్/బాల్కొండ/మెండోరా/మోర్తాడ్/ ఏర్గట్ల/భీమ్గల్/ముప్కాల్, డిసెంబర్ 3: బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్రెడ్డి మూడోసారి గెలుపొందడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం వేల్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకున్నారు.
కమ్మర్పల్లి, వేల్పూర్, బాల్కొండ, మెండోరా, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల, ముప్కాల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుతూ ప్రశాంత్రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.