ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. నిజామాబాద్ పరేడ్గ్రౌండ్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.