పోడు రైతుల సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిబిడ్డలకు న్యాయం చేయడంపై దృష్టి సారించింది. పోడు భూముల్లో ఏండ్ల కొద్దీ సాగులో ఉన్న వారికి పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా, కామారెడ్డి జిల్లాలో 27,482 వచ్చాయి. వాటిని పరిశీలిస్తున్న అధికారులు గ్రామ సభలు నిర్వహించి, అసలైన పోడు రైతుల గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారికి పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అర్హులకే పోడు పట్టాలు…
ఎటువంటి భూమి లేకుండా అటవీ భూమిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారు పోడు పట్టాలకు అర్హులు. ఇప్పటి వరకు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాం. అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాపులను తయారుచేశాం. సబ్ డివిజన్ లెవల్ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన కొనసాగుతున్నది. బాన్సువాడ డివిజన్లో ఇప్పటికే 50 వరకు పరిశీలించాం. ప్రతిపాదనలను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతాం.
– రాజాగౌడ్, ఆర్డీవో, బాన్సువాడ