పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యుత్తమ గ్రేడ్లు సాధించాయి. ప్రభుత్వ బడుల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఉమ్మడి జిల్లాలోని వందలాది సర్కారీ స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ప్రైవేట్ పాఠశాలలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. మొత్తంగా చూస్తే బాలుర కన్నా బాలికలే ఎక్కువగా పాసయ్యారు. 93.32 శాతం ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా మాత్రం 21 స్థానంతో సరిపెట్టుకుంది.
ఖలీల్వాడి మే 10: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం దక్కించుకున్నది. జిల్లా వ్యాప్తంగా 21,592 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 18,810 మంది ఉత్తీర్ణులయ్యారు. 87.12 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచింది. పది ఫలితాల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 10,668 మంది బాలికలు పరీక్షలు రాయగా 9,410 మంది పాసై, 88.21శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 10,924 మంది పరీక్షలు రాయగా, 9,400 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 86.05గా నమోదైంది. జిల్లాలోని 163 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. ఇందులో 62 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 101 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 153 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా, అందులో 31 మంది ప్రభుత్వ, 122 మంది ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విజయ్పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అర్పిత, భవగ్న, హసిని, కే హాసిని, రుషిక, సహన, సహస్ర రెడ్డి, సాయిశ్లోక, శ్రీపర్ణ, వర్షిణి, సౌమిత్రి, అభిషేక్, చైతన్ కుమార్, కారుణ్య, నయన్రెడ్డి, సిదార్థ 10/10 జీపీఏ సాధించారు. పాఠశాల కార్యదర్శి అమృతలతా, కరస్పాండెంట్ ప్రభాదేవి, డైరెక్టర్ వసంత సుజాత విద్యార్థులను అభినందించారు.
బోధన్, మే 10: బోధన్ డివిజన్కు చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉత్తమ గ్రేడ్ పాయింట్లు పొందారు. బోధన్ పట్టణానికి చెందిన శ్రీ విజయసాయి హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. మొత్తం 14 మంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. కె.శ్రీదేవి రెడ్డి, పి.శ్రీసాహితీ, పి.మహాలక్ష్మి, జి.అదితి, ఫరీహ ఫలక్, షిఫా కౌసర్, బి.వీక్షశ్రీ, కె.రచన, పి.వైష్ణవి, బి.యజ్ఞశ్రీ, మహ్మద్ అయానుద్దీన్, ఎల్.శ్రీవిష్ణు, వి.మణితేజరెడ్డి, ఎం.వేణులకు 10/10 జీపీఏ వచ్చింది. ప్రతిభ చాటిన విద్యార్థులను హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణమోహన్ అభినందించారు. బోధన్ పట్టణం ఆచన్పల్లిలోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ జీపీఏ గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఆర్. దివ్యశ్రీ, ఎ.రుశ్వితలకు 10/10 జీపీఏ వచ్చాయి. బి.ప్రవీణ్కమార్, జి.నందిని, ఎం.సృజన్రెడ్డి, వేల్పుల కావేరి 9.8 జీపీఏ సాధించారు. పి.స్నే హ, కె.అవంతిక, డి.రోచిష్న, సాయిచరణ్రెడ్డి, ఎం.అరవింద్, ఎస్.సుమిత్, జె.సాహి తీ అనే విద్యార్థులకు 9.7 జీపీ ఏ వచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ కొడాలి కిశోర్ అభినందించారు.
బోధన్ పట్టణానికి చెందిన మాతృశ్రీ హైస్కూల్ విద్యార్థులు ముగ్గురు 10/10 జీపీఏ సాధించారు. దేశ్పాండ్ శార్వరీ, జవ్వాజి సహస్రిక, కోట రామ్చరణ్రెడ్డిలకు 10 జీపీఏ వచ్చాయి. ఇదే స్కూల్కు చెందిన ఒకరికి 9.8 జీపీఏ, నలుగురికి 9.7 జీపీఏ, ఎనిమిది మందికి 9.5 జీపీఏ వచ్చింది. మొత్తం 40 మంది విద్యార్థులు 9 కన్నా ఎక్కువ జీపీఏ పొందారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ దిగంబర్రావు అభినందించారు.
కామారెడ్డి,మే 10 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలో 7వ స్థానం లో నిలిచింది. ఈ ఏడాది 93. 32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,861 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా 11,069 మంది పాస్ అయ్యారు. బాలురు 5484, బాలికలు 5585 మంది పాస్ కాగా, బాలురు 92.39శాతం, బాలికలు 94.26శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్లో 12 మంది విద్యార్థులకు 8 మంది ఉత్తీర్ణతతో 66.6, ప్రభుత్వ పాఠశాలల్లో 399మంది విద్యార్థులకు 340మంది ఉత్తీర్ణతతో 85.21 శాతం, కేజీబీవీలో 744 మందికి 714 ఉత్తీర్ణతతో 95.97శాతం, మోడల్ స్కూల్స్లో 590 మంది కి 578మంది ఉత్తీర్ణతతో 97.97 శాతం, టీఎస్ మైనార్టీ రెసిడెన్షియల్లో 255 మందికి 251 మంది ఉత్తీర్ణతతో 98.43శాతం, సోషల్ వెల్ఫేర్లో 1062 మంది కి 1053 మంది ఉత్తీర్ణతతో 99.15 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 825 మందికి 806 మంది ఉత్తీర్ణతతో 97.70 శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6,046 మందికి 5432 మంది ఉత్తీర్ణతతో 89.84 శాతంతో, ట్రైబర్ వెల్ఫేర్లో 370 మందికి 365 మంది ఉత్తీర్ణతతో 98.65శాతం, బీసీ వెల్ఫేర్లో 422 మందికి 420 మంది ఉత్తీర్ణతతో 99.53 శాతం, రెసిడెన్షియల్ 69 మంది కి 68 మంది ఉత్తీర్ణతతో 98.55 శాతం నమోదైంది.ప్రైవేటు పాఠశాలల్లో 2129 మంది విద్యార్థులకు 2087 మంది ఉత్తీర్ణతతో 98.03 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఆర్కిడ్స్ పాఠశాలకు చెందిన అనన్య,చికిత 10/10 జీపీఏ సాధించారు. శ్రీవల్లి, పూర్వజ, దివ్య శ్రీ 9.8 జీపీఏ సాధించారు. లిటిల్ స్కాలర్స్ పాఠశాలకు చెందిన ఐశ్వర్య, రమ్య శ్రీ, శ్రీజయ్రెడ్డి, అక్షిత్ 10/10 జీపీఏ సాధించారు. లయోలా హైస్కూల్ నుంచి కల్కి మిత్ర, నేహ, మని హసిత్ 10/10 జీపీఏ సాధించారు. 9.8 జీపీఏ 12మంది, 9.7 జీపీఏ 11మంది, 9.0 జీపీఏ 59 మంది సాధించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఆర్కిడ్స్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ పున్న రాజేశ్, లయోలా హైస్కూల్ ప్రిన్సిపాల్ వి.బి.చారి అభినందించారు.
భిక్కనూరు, మే 10: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి పాఠశాలకు చెందిన వైష్ణవి, జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన 14మంది విద్యార్థులు 10/10జీపీఏ సాధించినట్లు ఎంఈవో ఎల్లయ్య పేర్కొన్నారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, టీఎస్ సోషల్ వెల్ఫేర్ స్కూల్, గురుకుల, కేజీబీవీ విద్యార్థులున్నారు. ప్రతిభచాటిన విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు అభినందించారు.