రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం పలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గిరిజన బాంధవుడని కొనియాడారు.
కోటగిరి మండలం జల్లాపల్లి అబాదిలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న గిరిజనులు