ఉమ్మడి జిల్లాలో వినాయకచవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడవాడలా గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వినాయక పూజల్లో పాల్గొన్నారు.