
Notice2
Sirikonda | సిరికొండ, జూలై 6 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని కారణంతో మరికొందరు చెత్తను వారికి చేనుకు కంచె వేసుకుంటున్నారు.
ఈ ఘటనపై ‘నమస్తే తెలంగాణ’లో ‘హరితహారం చెట్లు నరికి కంచవేశారు..’ అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై పందిమడుగు గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ స్పందించి చెట్లు నరికిన ఒకరికి రూ.2వేలు, మరొకరికి రూ.1000 జరిమానా విధించారు. ఎవరైనా రోడ్డుకు ఇరువైపుల నాటిన చెట్లను నరికితే వారిపై కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని కార్యదర్శి, సర్పంచ్ గోవింద్ తెలిపారు.