HomeNizamabadExcise Officials Have Finally Caught Two Members Of A Gang Supplying Ganja In Nizamabad District
జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈఎస్ కిషన్ వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 25 : నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈఎస్ కిషన్ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మం డలం యాచారం గ్రామానికి చెందిన బానోత్ వసంత్ రా వు అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బకార్ తాలుకా నందాబుకార్ తండాలో నివాసం ఉండే తన రెండో భార్య ఇంట్లో గంజాయిని నిల్వ చేసిన ట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఐదు రోజుల క్రి తం సమాచారం అందింది.
దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సభ్యులు నాలుగు రోజులుగా నవీపేట్ మండలం యంచ వద్ద కాపు కాచారు. ఎట్టకేలకు సోమవారం గంజాయి తరలిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని పట్టుకొన్నారు. అందులో తనిఖీ చేయగా రూ.80 లక్షలు విలువ చేసే 157.65 కేజీల ఎండు గంజాయి లభించింది.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బానోత్ వసంత్ రావు, అతని బంధువు బానోత్ ప్రవీణ్లను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రాంకుమార్, సిబ్బంది హమీద్, శివకుమార్, ఉత్తమ్, విష్ణు, అవినాష్, రాజన్న, నారాయణరెడ్డి, జగన్, ఆశ న్న, శివప్రసాద్, భోజన్న స్మగ్లర్లను పట్టుకోవడానికి కృషి చేశారని ఏఈఎస్ వారిని అభినందించారు.
ఒడిశా కేంద్రంగా..
ఒడిశాను కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి గంజాయి మహారాష్ట్ర ప్రాంతానికి తరలించి నాందేడ్ జిల్లాలో డంప్ చేస్తారు. గంజాయి విక్రయించే వారి డిమాండ్ మేరకు రవాణా చేయడం వృత్తిగా పెట్టుకున్నారు.ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఇన్స్పెక్టర్లు స్వ ప్న, వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి స్మగ్లర్లను పట్టుకున్నారు.