కోటగిరి, ఏప్రిల్ 3: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీటి అందిస్తామని, రైతులు రెండు పంటలను సాగు చేసుకోవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. నీటి కొరత ఉండదన్నారు. పంట కోతలు పూర్తయ్యాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. బయట తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ఉమ్మడి కోటగిరి మండలం టాక్లీ గ్రామంలో రూ.కోటి తో నిర్మించిన వంతెన, కల్వర్టులను స్పీకర్ సోమవారం ప్రారం భించారు.అంతకు ముందు గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, డబుల్ బెడ్రూం ఇంటిని ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి మాట్లాడుతూ..రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేద లకు ఇప్పటివరకు 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలో ప్రజల నానా కష్టాలు
బీజేపీ పాలించే 20 రాష్ర్టాల్లో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని స్పీకర్ తెలిపారు. అక్కడ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుబీమా లేదని, ఆసరా కూడా అంతంత మాత్రమే ఇస్తున్నా రని చెప్పారు. మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి లు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఇంత మంది ముఖ్య మంత్రులు ఉన్నా.. కేసీఆర్ మాదిరిగా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అనంతరం టాక్లీ గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు.
తెలంగాణ సర్కార్ బహుత్ అచ్చా హై..
తెలంగాణ సర్కార్ సీఎం కేసీఆర్ సాబ్ బహుత్ అచ్చా కామ్ కర్హ్రే హై అని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముత్కేడ్ తాలూకాలో గల ఆళంది గ్రామంలోని యోవ్తి సంస్థాన్ పీఠాధిపతి సద్గురు నరేశ్ మహరాజ్ అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఫిదా అయినట్లు తెలిపారు. ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి మరాఠీ భాషలో స్పష్టంగా వివరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం కానీ, ఎమ్మె ల్యేలు కానీ ప్రజల సమస్యలు, అభివృద్ధి గురించి పట్టించుకో రని తెలిపారు. అక్కడికి ఇక్కడికి భూమి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, సర్పంచ్ విమలాబాయి దిగంబర్, ఎంపీటీసీ అనంత విఠల్, ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, ఎంపీపీ గంగాధర్పటేల్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్పటేల్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.