సర్కారు బడి కొత్తదనం సంతరించుకున్నది. నాణ్యమైన బోధనతో పాటు వసతుల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఫలితంగా పాఠశాలలు సరికొత్తగా ముస్తాబవుతున్నాయి.
నిజామాబాద్, నవంబర్ 2 : ఇది ప్రభుత్వ బడి..రైలులా మారిపోయింది. పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఎస్ఎంసీ చైర్మన్ శ్యామ్రావు పాఠశాలకు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ హంగులను అద్దారు. తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శ్యామ్రావు సొంతంగా రూ.13లక్షలతో ఈ రైలు బడిని తీర్చిదిద్దారు.
గతంలో 20 మంది ఉండే పాఠశాలలో ప్రస్తుతం 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు బడులకన్నా ప్రభుత్వ బడి ఆకర్షణీయంగా కనిపించడంతో గ్రామస్తులు వారి పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించారు. ఈ పాఠశాలలోనే హెడ్మాస్టర్ విజయలక్ష్మి కొడుకుని, ఎస్ఎంసీ చైర్మన్ శ్యామ్రావు కూతురినీ చదివించడం విశేషం.
మధ్యాహ్న భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తున్న విద్యార్థులు
తరగతి గదిలో చదువుకుంటున్న విద్యార్థులు