Ration Cards | కంటేశ్వర్, జులై 17 : రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ మరోసారి కీలక సూచనలు జారి చేసింది. ఈ కేవైసీ విషయంలో లబ్ధిదారులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకొని లబ్ధిదారులు తమ రేషన్ కార్డులు వెంటబెట్టుకొని వెంటనే సంబంధిత డీలర్లను కలవాలని సూచించింది.
ఉచితంగా ఈ-కేవైసీ చేసుకునేందుకు జూలై 31 వరకు గడువు ఉందని నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకొని లబ్ధిదారులకు భవిష్యత్లో సరుకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ వెంటనే తమ రేషన్ కార్డులను ఈ-కేవైసీ చేసుకోవాలని తెలిపారు.