బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చెబుతున్నారు ఈ గిరిజనం. తాగునీటి కోసం తల్లీబిడ్డలంతా పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువుతండా గ్రామ పరిధిలోని దుర్గమ్మగుడి తండాలో గిరిజనులు తాగునీటి తిప్పలు ఎదుర్కొంటున్నారనడానికి నిదర్శనం. తండాలో దాదాపు 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.