భీమ్గల్, సెప్టెంబర్ 24: అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వారు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. తెల్లారితే కేసీఆర్ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్రెడ్డి .. ఆయన కాలి గోటికి సరిపోరన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత హామీల మాయలో పడి తినే పల్లెంలో మన్నుపోసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.
పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఎందుకు కట్టించలేదని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు. ఆదివారం ఆయన భీమ్గల్ మండలంలో పర్యటించారు. సుమారు రూ.24 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.18కోట్ల నిధులతో నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిపై లబ్ధిదారులు,వారి బంధువులు పూల వర్షం కురిపించారు. మంగళహారతులు,బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు.
అర్హులైన పేదలకు ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తుందని తెలిపారు. పైరవీకారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా చేపట్టినట్లు చెప్పారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వారు ఇచ్చే హామీలను అమలు చేసి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. తెల్లారితే కేసీఆర్ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్రెడ్డి .. ఆయన కాలి గోటికి సరిపోరన్నారు. మాటలు తప్ప వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేసింది ఏమీలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పైరవీకారులదే రాజ్యమని, స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ గోస లేదన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలని పేర్కొన్నారు. ఓట్ల కోసం మభ్యపెట్టే మాటలని అన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత హామీల మాయలో పడి తినే పళ్లెంలో మన్నుపోసుకోవద్దని ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
బాల్కొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం
బాల్కొండ మండల కేంద్రంలో రూ.1.90 కోట్లతో నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రెసిడెన్షియల్ ఆఫీస్ను ప్రారంభించి మంత్రి దంపతులు సతీసమేతంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన వినూత్న ఆలోచన అని తెలిపారు.