మాక్లూర్, జనవరి 7: యువత ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మండలంలోని దాస్నగర్లో ఉన్న విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో ట్రాఫిక్ నిబంధనలపై కళాశాల చైర్మన్ నరేందర్రెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సును శనివారం ఏర్పాటుచేశారు. సదస్సును సీపీ ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న యువత ఎక్కువగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారిపై ఆధారపడ్డ కుటుంబం ఎంతో క్షోభను అనుభవిస్తున్నదని తెలిపారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాల ని, అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు.
ప్రమాదాలు జరిగినప్పు డు వెంటనే అంబులెన్స్తో పాటు డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని విద్యార్థులకు సూచించారు. రిటైర్డ్ డిఫెన్స్ అధికారి మొగులయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై సీపీ అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, రిటైర్డ్ డిఫెన్స్ అధికారి, మైక్రో ఆఫీసర్, సామాజిక కార్యకర్త మొగులయ్య, ట్రాఫిక్ సీఐ చందర్రాథోడ్, ఎస్సై యాదగిరిగౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ సంపత్, సురేశ్, స్వప్న, పీఆర్వో వాసుగౌడ్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.