ఖలీల్వాడి/కామారెడ్డి, మే31: నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 6,46,557మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 93,378 మందికి కళ్లద్దాలు అందించినట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 1,155 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 32 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 4,48,938 మందికి పరీక్షలు నిర్వహించి 61,894 మంది కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు.