రుద్రూర్/మోస్రా(చందూర్)/చందూర్, జూలై 25 : డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా, చందూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన కార్యక్రమంలో రెండు మండలాల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు రాష్ట్రంలో పేదలకు డబుల్బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామంటే హేళన చేసిన వారే నేడు ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొదట్లో 1400 ఇండ్లతో ప్రారంభించి ఇప్పుడు 11వేల ఇండ్లను నిరుపేదలకు అందజేశామని అన్నారు.
నిత్యం పేదల గురించి ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఇండ్లు నిర్మాణంలో ఉన్న వారికి త్వరలో మిగతా బిల్లులను అందజేస్తామన్నారు. అంతే కాకుండా ఇకపై రూ.3 లక్షల స్కీంలో అర్హులైన లబ్ధిదారులు కొలతలతో సంబంధం లేకుండా నచ్చిన రీతిలో, సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించారన్నరు. రుద్రూర్ మండలానికి చెందిన 191 మంది లబ్ధిదారులకు, కోటగిరి, పొతంగల్ మండలాలకు కలిపి 280 మందికి, వర్ని మండలంలో 24మందికి, మోస్రాలో 105 మందికి, చందూర్లో 180 మంది లబ్ధిదారులకు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.నియోజకవర్గంలో 100 జనరల్ ఫంక్షన్ హాళ్లు నిర్మించడంతో తక్కువ ఖర్చుతో పేదింటి ఆడపిల్లల పెండిళ్లు చేసుకోవచ్చన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
రానున్న మూడు రోజుల్లో అతిభారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పాత ఇండ్లలో, విద్యుత్ స్తంభాలు, పొలాలు, వరద ఉధృతి వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుద్రూర్ కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, హౌసింగ్ ఈఈ నాగేశ్వర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, సీనియర్ నాయకులు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, కోటగిరి జడ్పీటీసీ శంకర్పటేల్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, కోఆప్షన్ మస్తాన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యవజన విభాగం అధ్యక్షుడు కన్నె రవి, లాల్మహ్మద్ తదితరులు ఉన్నారు. మోస్రాలో ఏసీపీ కిరణ్, జడ్పీటీసీ గుత్ప విజయా భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, మండల కో- ఆప్షన్ సభ్యుడు షేక్ ఫిరోజ్, ఎంపీటీసీ మమత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, తహసీల్దార్ సాయిలు, ఎంపీడీవో భారతి, సాయాగౌడ్, సర్పంచులు, నరేందర్, సుమలతా రాంరెడ్డి, విమలా లింగయ్య, సున్నం భూమయ్య, నాయకులు, కార్యకర్తలు , రైతులు తదితరులు పాల్గొన్నారు.
చందూర్లో రాజాగౌడ్, ఏఎంసీ చైర్ పర్సన్ కవితాఅంబర్ సింగ్, ఎంపీపీ లావణ్యారాంరెడ్డి, ఎంపీటీసీ శ్యాంరావ్, ఎంపీడీవో నీలావతి, సర్పంచులు సాయారెడ్డి, బొడ్డోల్ల సత్యనారాయణ, దేవీసింగ్ , లాకావత్ రవి, దాసరి గంగారాం, ప్యారం అశోక్, మాధవరెడ్డి, నాయకులు , కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.