తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభ్వుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, బెటాలియన్లో, అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు అమరవీరులు చేసిన కృషి.. ఈ పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తు చేశారు.
శుక్రవారం నుంచి ఈనెల 22 వరకు దశాబ్ది వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. – నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్2