సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల్లో చెరుకును నరికి, ఎడ్లబండ్లపై ఫ్యాక్టరీకి తరలించి ఉపాధిని పొందడానికి, ఏటా చాలా మంది రైతులు తమ కుటుంబాలతో కలిసి వస్తుంటారు.
గాంధారి మండల కేంద్రం మీదుగా నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు తమ కుటుంబాలతో కలిసి ఎడ్లబండ్లపై బయల్దేరారు. ఎడ్లబండ్లు ఒకదానికి వెనుక ఒకటి వెళ్తుండగా మండల ప్రజల ఆసక్తిగా చూశారు.