బోధన్, మే 20: పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం బోధన్ డివిజన్ కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పలు కారణాలతో అన్ని రకాల వస్తువులపై ధర లు పెంచుతూ పేదలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు.
పేదలను పరోక్షంగా కష్టాల పాలు చేస్తున్న కేంద్రం దేశభక్తులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాస్ రేట్లను అడ్డగోలుగా పెంచడంతో సామాన్యుడి జీవనం భారంగా మారుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వ పెట్టుబడిదారులకు దాసోహం చేసే పార్టీ అని ఆరోపించారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాస్ రేట్లను కూడా తగ్గించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జె. శంకర్ గౌడ్తో పాటు పత్రి ఎల్లయ్య, జంగం గంగాధర్, పేట పోశెట్టి, కదిరే అర్జున్, నాగలక్ష్మి, సుమలత, కార్యకర్తలు పాల్గొన్నారు.