ఆర్మూర్, మే 29: అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అధిక పన్ను వేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, కేంద్రం పెట్రోల్, డీజిల్పై సెస్సును రద్దు చేయాలని, ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. వీటి పెంపుతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 31న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశం లో సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆర్మూర్ సబ్డివిజన్ నాయకు లు యు.రాజన్న, ఠాకూర్, రమేశ్, జక్కం శేఖర్, నజీర్, భూమ న్న తదితరులు పాల్గొన్నారు.