Kotagiri | కోటగిరి, సెప్టెంబర్ 1 : ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ తెల్ల రవికుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డులను మంగళవారం ఆవిష్కరణ చేశారు. కాంగ్రెస్ 2023లో ఓట్ల కోసం ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తప్పనిసరిగా వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, మోరే గౌతమ్, గగన్, వడ్ల శ్రీనివాస్ గుండప్ప, పాషా సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.