హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి ఈ నెల 20వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్చైర్మన్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు పేర్కొన్నారు.
చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తుల గడువు పొడిగించినట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు tghb. telangana. gov.in వెబ్సైట్, లేదా హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించాలని ఆయన సూచించారు.