Nutritious Food | కోటగిరి , ఫిబ్రవరి 9 : పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి వీర మణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు ప్రతీ రోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.
చిన్నారులు ఎంతమంది ఉన్నారని గర్భిణీ బాలింతలు ఎంతమంది ఉన్నారని స్థానిక టీచర్ పద్మశ్రీని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం చాలా బాగుందని విద్యార్థుల సంఖ్య కూడా బాగుందని టీచర్ ను సర్పంచ్ అభినందించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు మొత్తి పేట రాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.