మద్నూర్, మార్చి 13: మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ వాటిని పరిశీలించి, ఎవరికీ ఇబ్బందులు లేకుండా కూల్చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు.
నెలరోజుల్లోనే కూల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ముజీబ్, పంచాయతీ ప్రత్యేకాధికారి డాక్టర్ విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి సందీప్కుమార్, జూనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్, సిబ్బంది ఉన్నారు.