ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 13: ఆర్మూర్లోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
విద్యార్థుల హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుకూలంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుంచి ఎన్ని గంటలకు ప్రశ్నాపత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి? ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉన్నదా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.