భిక్కనూరు/కామారెడ్డి, నవంబర్ 9 : ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహిళలు, యువతులు, వృద్ధులు తరలివచ్చారు. కామారెడ్డి నియోజకర్గ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్కు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఆతిథ్యం ఇచ్చారు.
తన నివాసంలో భోజనాన్ని ఏర్పాటు చేశారు. అంతకముందు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణకు హెలికాప్టర్లో వచ్చిన సీఎంకు విప్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం కాన్వాయి నేరుగా విప్ ఇంటికి చేరుకోగా గంపగోవర్ధన్ సతీమణి రాణి,కొడుకు గంప శశాం క్, కోడలు సీఎంకు సంప్రదాయ బద్ధంగా ఆహ్వానించారు. అనంతరం కామారెడ్డి పుర ప్రముఖులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.