ఖలీల్వాడీ, జూలై 11 : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళితజాతి అభ్యున్నతి కోసం మనసు పెట్టి పనిచేసే మ హోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బాబు జగ్జీవన్రాం, బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమి టీ ఆధ్వర్యంలో దళితరత్న అవార్డుల ప్రదానోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వేముల విచ్చేయగా, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కరిజాన్ని నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా, గడిచిన 70 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా అణగారిన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దళితబంధు పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 30వేల కుటుంబాలు లబ్ధి పొందాయని, ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 1100 మంది చొప్పున మరో లక్షా 40 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామన్నారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు కింద రూ. 10లక్షల గ్రాంటును అందిస్తామన్నారు. దీంతో పాటు దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విద్య ఎంతో అవసరమని గుర్తించి ఈ దిశగా సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సామాన్య నిరుపేద ప్రజలకు సైతం ఉచితంగా కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నదన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించే బాధ్యతలు తనకు దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి వేము ల భావోద్వేగానికి లోనయ్యారు. అంబేద్కర్ మహనీయుని నడవడికపై లోతుగా అధ్యయనం చేస్తూ ప్రతి చిన్న అంశాన్ని సైతం సూక్ష్మంగా పర్యవేక్షణ జరుపు తూ అహరహం శ్రమించడంతో నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో రాష్ట్ర రాజధానిలో ఎంతో ఠీవీగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైందన్నారు. ప్రపంచమంతా అబ్బురపడేలా నూతన సచివాలయం సైతం నిర్మించే అవకాశం తనకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ రెండు ఘట్టాలని తాను జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనన్నారు. కాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్న స్థాయికి వచ్చారని కొనియాడారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారు ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించాలని హితవు పలికారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ అనేక చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన 30 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి దళితరత్న అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా వాసుడైన ఆర్.లింబాద్రిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం దళిత సమాజం కోసం చేసిన సేవలను గుర్తించి దళిత నాయకులను దళితరత్న అవార్డుతో సన్మానించుకోవడం సంతోషకరమన్నారు. మాదిగ సంఘ భవనం నిర్మాణానికి 7లక్ష 20వేల ఎమ్మెల్యే కోట సీడీపీ మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పని చేస్తుందన్నారు. దళిత సోదర సోదరీమణులందరూ సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ బాబు జగ్జీవన్రామ్, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.పాపయ్య, దళిత సం ఘాల ప్రతినిధులు నాంపల్లి, బాబురావు, విద్యాసాగర్, శ్రీనివాస్, గైని గంగారాం, ప్రముఖ విద్యావేత్త మారయ్యగౌడ్ పాల్గొన్నారు.