నిజామాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు మొదటి విడుతలోనే బీ-ఫామ్లు అందుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ తరఫున విప్ గంప గోవర్ధన్ స్వీకరించారు. సెంటిమెంట్గా వస్తున్న తొలి బీ-ఫామ్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రగతి భవన్లో స్వీకరించారు. తెలంగాణ భవన్లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్ అందుకున్నారు. అభ్యర్థులకు బీ-ఫామ్లతో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అధినేత కేసీఆర్ స్వయంగా అందించారు.
నిజామాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో గతంలో ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ-ఫామ్లు అందాయి. కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించిన బీ-ఫామ్ను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన బీ-ఫామ్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. గతం మాదిరిగానే సెంటిమెంట్గా వస్తున్న తొలి బీ-ఫామ్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్వీకరించారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నుంచి బీ-ఫామ్ పొందారు. తెలంగాణ భవన్లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, షకీల్ అహ్మద్, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్లు అందుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్లతో పాటుగా ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అధినేత కేసీఆర్ స్వయంగా అందించారు. బీ-ఫామ్లను అందుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలంతా కేసీఆర్కు పాదాభివందనం చేశారు. అధినేత ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్బంగా వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేలంతా బీ-ఫామ్లు అందుకున్న తర్వాత తమ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. 119 నియోజకవర్గాలకు గాను 115 స్థానాలకు గులాబీ బాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇందులో తొలి విడతలో 51 మందికి బీ-ఫామ్లు అందించారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన వారందిరకీ ఒకే దఫాలో బీ-ఫామ్లు అందడం విశేషం.
నియోజకవర్గం బాల్కొండ, (నిజామాబాద్ జిల్లా)
పూర్తిపేరు : వేముల ప్రశాంత్ రెడ్డి
పుట్టినతేదీ : 14.03.1966
తల్లిదండ్రులు : వేముల సురేందర్ రెడ్డి, మంజుల
భార్య : నీరజా రెడ్డి
విద్యార్హత : బీఈ
సంతానం : కుమారుడు, కూతురు
స్వగ్రామం : వేల్పూర్, నిజామాబాద్ జిల్లా
రాజకీయ ప్రవేశం : 2014
రాజకీయ అనుభవం : 9 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 2014లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్), 2018లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్), 2019 నుంచి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు, 2016 నుంచి 2018 వరకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా బాధ్యతలు
నియోజకవర్గం నిజామాబాద్ రూరల్, (నిజామాబాద్ జిల్లా)
పూర్తిపేరు : బాజిరెడ్డి గోవర్ధన్
పుట్టినతేదీ : 17.02.1954
తల్లిదండ్రులు : శాంతాబాయి, దిగంబర్ పటేల్
భార్య : బాజిరెడ్డి వినోద
విద్యార్హతలు : బీఏ
సంతానం : బాజిరెడ్డి జగన్మోహన్, బాజిరెడ్డి అజయ్, ధరణి
స్వగ్రామం : రావుట్ల, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా
రాజకీయ ప్రవేశం : 1981
రాజకీయ అనుభవం : 42 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 1981లో చీమన్పల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక, 1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నిక, 1992లో సిరికొండ సింగిల్విండో చైర్మన్గా ఎన్నిక, 1993లో ఏపీఎస్ఎఫ్సీ డైరెక్టర్గా ఎన్నిక, 1994లో ఆర్మూర్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓటమి (స్వతంత్ర),
1999లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (కాంగ్రెస్), 2004లో బాన్సు వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (కాంగ్రెస్),2009లో బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి (కాంగ్రెస్), 2014లో నిజామాబాద్రూరల్లో ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్),2019లో నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్)
నియోజకవర్గం ఆర్మూర్, (నిజామాబాద్ జిల్లా)
పూర్తిపేరు : ఆశన్నగారి జీవన్రెడ్డి
పుట్టినతేదీ : 07.03.1976
తల్లిదండ్రులు : వెంకటరాజన్న, రాజాబాయి
భార్య పేరు : రజితారెడ్డి
సంతానం : అనౌషికారెడ్డి, అనన్యరెడ్డి
చదువు : న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు
స్వగ్రామం : గ్రామం: జాన్కంపేట్, వేల్పూర్ మండలం
రాజకీయ ప్రవేశం : 2014
రాజకీయ అనుభవం : 9 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 2014లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్), 2018లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్), 2019లో పీయూసీ చైర్మన్గా ఎన్నిక
నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్, (నిజామాబాద్ జిల్లా)
పేరు : బిగాల గణేశ్ గుప్తా
పుట్టినతేదీ : 17.04.1970
తల్లిదండ్రులు : బిగాల కృష్ణమూర్తి, సువర్ణమాల
భార్య : లత
విద్యార్హత : బీఈ
సంతానం : రిది, రియా
స్వగ్రామం : గ్రామం&మండలం: మాక్లూర్, నిజామాబాద్ జిల్లా
రాజకీయ ప్రవేశం : 2009
రాజకీయ అనుభవం : 14 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 2009లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. (బీఆర్ఎస్), 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్),2018లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు (బీఆర్ఎస్)
నియోజకవర్గం బాన్సువాడ (కామారెడ్డి జిల్లా)
పేరు : పరిగె శ్రీనివాస రెడ్డి
పుట్టిన తేది : 10.02.1949
తల్లిదండ్రులు : పరిగె పాపమ్మ, రాజారెడ్డి
భార్య : పరిగె పుష్పమ్మ
విద్యార్హత : బీఈ
సంతానం : డాక్టర్ పరిగె రవీందర్ రెడ్డి, పరిగె సురేందర్ రెడ్డి, పరిగె భాస్కర్ రెడ్డి, కూతురు పరిగె అరుణ
స్వగ్రామం : పోచారం, బాన్సువాడ మండలం, కామారెడ్డి జిల్లా
రాజకీయ ప్రవేశం : 1977
రాజకీయ అనుభవం : 46 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 1977లో దేశాయిపేట సొసైటీ చైర్మన్గా ఎన్నిక, 1981లో దేశాయిపేట సొసైటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక, 1987లో బుడ్మి సొసైటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక, 1987లో నిజామాబాద్ జిల్లా డీసీసీ చైర్మన్గా ఎన్నిక, 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నిక (టీడీపీ), 1998లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు, 1999లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు. భూగర్భ గనుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు, 2000లో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు, 2009లో మూడో సారి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు (టీడీపీ), 2011లో తెలంగాణకు మద్దతుగా టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిక, 2011 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి నాల్గో సారి ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఐదో సారి గెలుపు(బీఆర్ఎస్). వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు, 2018లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఆరో సారి గెలుపు (బీఆర్ఎస్), 2019లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ప్రతిష్టాత్మక పదవి
నియోజకవర్గం ఎల్లారెడ్డి (కామారెడ్డి జిల్లా )
పూర్తి పేరు : జాజాల సురేందర్
పుట్టిన తేదీ : 25.03.1973
తల్లిదండ్రులు : జాజాల హన్మవ్వ, నర్సయ్య
భార్య పేరు : జాజాల భార్గవి
విద్యార్హత : బీకాం
సంతానం : జాజాల కిన్షుక్, జాజాల కీర్తీశ్
స్వగ్రామం : నల్లమడుగు, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా
రాజకీయ ప్రవేశం : 2004
రాజకీయ అనుభవం : 19 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 2004లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి..(టీడీపీ), 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి (కాంగ్రెస్), 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. అనంతరం బీఆర్ఎస్లో చేరిక.
నియోజకవర్గం బోధన్, నిజామాబాద్ జిల్లా
పూర్తి పేరు : మహ్మద్ షకీల్ ఆమేర్
పుట్టినతేదీ : 07.03.1976
తల్లిదండ్రులు : మహ్మద్ ఆజాం, షాగుఫ్తా ఆదిప్
భార్య పేరు : ఆయేషా ఫాతిమా
విద్యార్హత : డిగ్రీ
సంతానం : ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
నివాసం : ఆచన్పల్లి, బోధన్, జిల్లా: నిజామాబాద్
రాజకీయ ప్రవేశం : 1995
రాజకీయ అనుభవం : 27 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 1997లో ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమి, 2009లో బోధన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి (బీఆర్ఎస్) , 2014లో బోధన్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నిక (బీఆర్ఎస్), 2018లో బోధన్ నియోకజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నిక (బీఆర్ఎస్)
నియోజకవర్గం జుక్కల్ (కామారెడ్డి జిల్లా)
పూర్తిపేరు : హన్మంత్ షిండే
పుట్టినతేదీ : 14.08.1966
తల్లిదండ్రులు : మాదప్ప, నాగమ్మ
భార్య : శోభావతి
విద్యార్హత : బీఈ
సంతానం : ముగ్గురు కుమారులు
స్వగ్రామం : గ్రామం డోన్గావ్, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా
రాజకీయ ప్రవేశం : 2004
రాజకీయ అనుభవం : 19 ఏండ్లు
ఎన్నికల్లో పోటీ : 2004లో ఎమ్మెల్యేగా (టీడీపీ) నుంచి పోటీ చేసి ఓటమి, 2009లో ఎమ్మెల్యేగా (టీడీపీ) నుంచి గెలుపు, 2014లో ఎమ్మెల్యేగా (బీఆర్ఎస్) నుంచి గెలుపు, 2016 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ బాధ్యతలు, 2018లో ఎమ్మెల్యేగా (బీఆర్ఎస్) నుంచి గెలుపు, 2021న తెలంగాణ శాసనసభ ప్యానల్ స్పీకర్గా ఎన్నిక