ధర్పల్లి, జూలై 18 : మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేసేందుకు సోమవారం ఉదయం వచ్చిన వారికి ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గోవింద్పల్లి, దుబ్బాక గ్రామాల్లో పర్యటించి ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
గోవింద్పల్లిలో పట్టు పరిశ్రమ షెడ్డు, మేకల ఫారం షెడ్డుతోపాటు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం దుబ్బాకలో వైకుంఠధామాన్ని పరిశీలించి ఎంపీడీవో నటరాజ్, సిబ్బందిని అభినందించారు. వారి వెంట ఎంపీపీతో పాటు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, ఎంపీవో రాజేశ్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఉపాధి హామీ పనులు బాగున్నాయని అభినందించడం సంతోషంగా ఉందని ఎంపీడీవో నటరాజ్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని సూచించారు.