బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడడం.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందడంతో అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వర్ని మండలంలో, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో, ఎమ్మెల్యే జీవన్రెడ్డి డొంకేశ్వర్లో ప్రచారం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆత్మీయ సమ్మేళనాలతో జనం వద్దకు వెళ్లారు. కామారెడ్డిలో నిర్వహించిన మైనారిటీలు, పద్మశాలీ, గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాల్లో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రమణ, వేర్వేరుగా పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారు.
మోపాల్ (ఖలీల్వాడి)/ ధర్పల్లి, నవంబర్ 5 : మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి ఆధ్వర్యంలో బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సుమారు వంద మంది పార్టీలో చేరగా.. బాజిరెడ్డి గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాజిరెడ్డి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్పల్లి, నవంబర్ 5 : ధర్పల్లి మండలంలోని దుబ్బాక బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు వంద మంది యువకులు ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు. వారికి బాజిరెడ్డి జగన్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రాజెక్టు రామడుగు గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 100 మంది యువకులు జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ప్రచారంలో భాగంగా ప్రాజెక్టు రామడుగు గ్రామానికి వచ్చిన జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, దుబ్బాక గ్రామ శాఖ అధ్యక్షుడు కోతి శేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, యువజన విభాగం మండల అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి ప్రశాంత్గౌడ్, ఎంపీటీసీ పెండ గంగాధర్, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, సర్పంచ్ వెంకటేశ్, నాయకులు వినోద్, గోవర్ధన్రెడ్డి, విజయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.