నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/దోమకొండ రూరల్/రాజంపేట్/బీబీపేట్/భిక్కనూరు, అక్టోబర్ 31 : జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో గులాబీ దండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ వివరిస్తూ తమ దైన శైలిలో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు మంగళవారం ప్రచారం నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మాజిద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాము, సర్పంచులు పురం లక్ష్మి, దుర్గం శ్యామల, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, విండో చైర్మన్ మారుతి, నాయకులు పురం వెంకటి, మోహన్, దొబ్బల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విజయం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, ఎంపీటీసీ శ్రావణి, బోర్లం సోసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు జలీల్, మన్నెచిన్న సాయిలు, జెగ్గ ఆనంద్, మంజూరు తదితరులు పాల్గొన్నారు. దోమకొండతోపాటు అంచనూర్, అంబారీపేట్, ముత్యంపేట్, గొట్టిముక్కుల తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గండ్ర మధుసూదన్రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ శారద, భిక్కనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, సర్పంచ్ అంజలి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ నాగరాజ్రెడ్డి, ఎంపీటీసీలు రమేశ్, శంకర్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ శంకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోచయ్య, శ్రీనివాస్, బుర్రి రవికుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. బస్టాండు దగ్గరలో ఉన్న దుకాణాలకు వెళ్లి వ్యాపారస్తులను కలుస్తూ, ఇంటింటికీ తిరగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నల్లవెళ్లి అశోక్, దుబ్బని శ్రీకాంత్, శ్రీరాం సురేశ్, మచ్చ భాస్కర్, బచ్చగారి నర్సింహులు, నాయిని స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు. బీబీపేట్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.భిక్కనూర్తోపాటు కాచాపూర్, పెద్దమాల్లారెడ్డి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు