బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిత్యం జనంలోనే ఉంటూ చేసిన అభివృద్ధిని.. మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంతో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత, బిగాల గణేశ్ గుప్తా, షకీల్, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.